కామారెడ్డి జిల్లాలో కరోనాతో ఇద్దరి మృతి

కామారెడ్డి జిల్లాలో కరోనాతో ఇద్దరి మృతి
  • ఇవాళ జిల్లాలో రికార్డు స్థాయిలో 676 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

కామారెడ్డి: తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా రికార్డు స్ధాయిలో 676 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోవడం కలకలం రేపింది. ఇవాళ్టి కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 17611 కు చేరింది. అత్యధికంగా దేవునిపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో 81 కేసులు, కామారెడ్డి అర్బన్ పిహెచ్.సి పరిధిలో 61కేసులు, బీర్కూర్ లో 60, జిల్లా ఆస్పత్రి పరిధిలో 56 కేసులు, బాన్సువాడ ఆస్పత్రిలో 47కేసులు, పిట్లం ఆరోగ్య కేంద్రం పరిధిలో 46 కేసులు చొప్పున నమోదు అయ్యాయి. కామారెడ్డి ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.