సికింద్రాబాద్,వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి తెలిపారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, ఇతర అధికారులతో కలిసి ప్లాట్ఫామ్ –1లో మల్టీ లెవెల్పార్కింగ్కు నిర్మిస్తున్న బిల్డింగ్పనులు, ఇతర భవన నిర్మాణ పనులను కేంద్రమంత్రి పరిశీలించారు. రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులపై రైల్వే అధికారులతో రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత రాష్ర్ట ప్రభుత్వం తమకు సహకరించకపోవడంతో రాష్ర్టంలో చేపట్టాల్సిన పలు రైల్వే అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఆలస్యమైందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 26 లిఫ్టులు,32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు ఏర్పాటు చేస్తున్నారని, వీటితో పాటు స్టేషన్కు రెండు వైపులా మెట్రో స్టేషన్లు, బస్సు స్టేషన్లకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర, బీజేపి నేతలు పాల్గొన్నారు.