జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవాలి

జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవాలి
  • కార్యకర్తల సమావేశంలో నేతలు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం యూసఫ్​గూడలోని ఓ ఫంక్షన్ హాల్​లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు, జూబ్లీహిల్స్ ఇన్​చార్జ్ లంకాల దీపక్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వారి పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై నిలబడి పార్టీని బలోపేతం చేయాలని రామచందర్ రావు సూచించారు. జూబ్లీహిల్స్​లో పార్టీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు.