కొత్తపల్లి, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్ వాణినికేతన్ విజయఢంకా మోగించినట్లు స్కూల్ డైరెక్టర్ రేణుక తెలిపారు. 70 మంది విద్యార్థుల్లో 17 మంది 550కు పైగా మార్కులు, 46 మంది 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. సాయి ఆమోఫాకు 583, జె.సహస్ర 576 మార్కులు, రిఫిరేశ్, అక్షయ్కుమార్- 571 మార్కులు సాధించినట్లు చెప్పారు.

