
హనుమకొండ, వెలుగు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కు ‘ హై బ్లడ్ డోనర్ మోటివేటర్’అవార్డు దక్కింది. ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆయన అవార్డు అందుకున్నారు.
ఎక్కువ మందిని యూత్ ను రక్తదానం చేసేందుకు మోటివేట్చేసినందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రాజ్ భవన్లో సాంస్కృతి కమ్యూనిటీ హాలులో గవర్నర్, రెడ్ క్రాస్రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్వర్మ అవార్డును సీపీకి అందజేశారు.