మత్తు.. కావద్దు జీవితాలు చిత్తు : ప్రజాప్రతినిధులు

మత్తు.. కావద్దు జీవితాలు చిత్తు : ప్రజాప్రతినిధులు

మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తవుతాయని, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు తీసుకునే చర్యలతో నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.

 విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలుచోట్ల నిర్వహించిన ర్యాలీలను ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు జెండా ఊపి ప్రారంభించారు. కూడళ్లు, చౌరస్తాల్లో మానవహారం ఏర్పాటు చేసి డ్రగ్స్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ​మత్తు రహిత సమాజం కోసం కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై నిర్వహించిన కాంపిటీషన్​లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  - వెలుగు, నెట్​వర్క్​