వరంగల్ లో 846 కిలోల గంజాయి కాల్చివేత

వరంగల్ లో 846 కిలోల గంజాయి కాల్చివేత

కాజీపేట,వెలుగు : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 19 కేసుల్లో పట్టుబడిన 846 కిలోల గంజాయిని మంగళవారం దహనం చేశారు. దీని విలువ రూ. 4.28 కోట్లు ఉంటుంది.

 కాజీపేట శివారు అమ్మవారి పేటలోని కాకతీయ మెడిక్లిన్ సర్వీస్ లో డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ రవి, ఏసీపీ డేవిడ్ రాజు గంజాయిని కాల్చివేయించారు.