
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే ప్రాంతాలను సందర్శించి, అధికారులకు తగు సూచనలు చేశారు. శ్యాయంపేట ప్రాంతంలోని టెంపుల్ ట్రీ విల్లాస్ వద్ద చేపట్టబోయే మీడియన్ స్ట్రెచ్, కేఆర్ఆర్ టౌన్ షిప్ లో ఓపెన్ ప్లాట్ లో పార్క్ అభివృద్ధి పనులు, మియా వాకి ప్లాంటేషన్, శాయంపేట ప్రభుత్వ పాఠశాల నుంచి తెలంగాణ జంక్షన్ వరకు సుమారు స్ట్రెచ్ ఏర్పాటు విద్యుత్ నగర్ లో పార్క్ స్థలం ఆక్రమణకు గురికాకుండా అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కమిషనర్
రాష్ట్రవ్యాప్త మున్సిపల్ కమిషనర్లు అధికారులతో సీడీఎంఏ టీకే శ్రీదేవి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ వందరోజుల యాక్షన్ప్లాన్ను సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ నుంచి స్మార్ట్ సిటీ నగరాల కమిషనర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ను కొనసాగించాలని స్మార్ట్ సిటీ జాయింట్ సెక్రటరీ రూప మిశ్రా అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నగరం నుంచి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పాల్గొని నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ పనుల పురోగతిని వివరించారు.