
పాకిస్తాన్ వైమానిక దాడి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ట్రై-సిరీస్ నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ తప్పుకున్న ఈ సిరీస్ యధావిధిగా జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో జింబాబ్వే ఈ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు శనివారం (అక్టోబర్ 18) కన్ఫర్మ్ చేసింది. టీ20 ఫార్మాట్ లో నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న ఈ ట్రై సిరీస్ లో పాకిస్థాన్, శ్రీలంక, జింబాబ్వే ఆడనున్నాయి. "ఆఫ్ఘనిస్తాన్ టోర్నమెంట్లో పాల్గొనడానికి తమ అసమర్థతను వ్యక్తం చేసింది. నవంబర్ 17 నుండి 29 వరకు రావల్పిండి, లాహోర్ వేదికలుగా జరగనున్న ఈ సిరీస్ కు జింబాబ్వే క్రికెట్ అంగీకరించింది". అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
పాకిస్తాన్ ఏరియల్ స్ట్రైక్ లో ముగ్గురు లోకల్ క్రికెటర్లతో పాటు ఐదు మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే. బోర్డర్ లో పక్టిక ప్రావిన్స్ సమీపంలో జరిగిన ఈ దాడిలో కబీర్, సిగ్బతుల్లా, హరూన్ అనే క్రికెటర్లు షరానా లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి వస్తుండగా దాడి జరిగింది. పాక్ దాడిపై పిరికిపంద చర్యగా ఆగ్రహించిన రషీద్ ఖాన్.. లేటెస్టుగా లాహోర్ ఖాలండర్స్ ను బయో నుంచి డిలీట్ చేయడం.. పీఎస్ఎల్ ను బాయ్ కాట్ చేస్తున్నాడనే రూమర్స్ కు కారణమయ్యింది. ఇప్పటికే ట్రై సీరీస్ ను రద్దు చేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే సీరీస్ యదావిధిగా కొనసాగుతుందని పాక్ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది.
Also Read : పరువు కాపాడిన రాహుల్, అక్షర్
ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు దేశాల సైన్యాలు ఒకవైపు పోరాడుతుంటే.. ఇప్పుడు క్రికెట్ పైన కూడా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తమ దేశ ఆటగాళ్ల మృతిపై ఆఫ్ఘాన్ క్రికెటర్లు సీరియస్ గా ఉన్నారు. అయితే కెప్టెన్న రషీద్ ఖాన్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను బాయ్ కాట్ చేయనున్నట్లు వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.