రైస్ మిల్లు డబ్బులు పక్కదారి.. ముగ్గురు సిబ్బందిపై కేసు

రైస్ మిల్లు డబ్బులు పక్కదారి.. ముగ్గురు సిబ్బందిపై కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రైస్ మిల్‌‌‌‌‌‌‌‌ డబ్బులను పక్కదారి పట్టించిన  ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం పరిధిలోని కవితా పారబాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్‌‌‌‌‌‌‌‌లో కలెక్షన్ ఏజెంట్ బొజ్జ నవీన్, అకౌంటెంట్ దేవరశెట్టి వెంకన్న, కంప్యూటర్ ఆపరేటర్ రేపాక రమేశ్​ కొన్నేళ్లుగా పని చేస్తున్నారు. వీరు బియ్యం కొనుగోలు చేసిన హోల్‌‌‌‌‌‌‌‌సేల్ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంకుల్లో జమ చేయాల్సి ఉంటుంది.

ఇటీవల మిల్‌‌‌‌‌‌‌‌లో ఆడిట్ నిర్వహించగా లెక్కల్లో రూ.50 లక్షల తేడా వచ్చింది. యాజమాన్యం ఆ ముగ్గురిని ప్రశ్నించగా తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించి తప్పుడు లెక్కలు చూపినట్లు తెలిసింది. మిల్లు యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.