
బషీర్ బాగ్, వెలుగు: గత నెల 31న అర్ధరాత్రి అబిడ్స్ గ్రాండ్ హోటల్ లో కస్టమర్లపై దాడి ఘటనలో 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, కస్టమర్లపై దాడి ఘటనలో హోటల్ ఓనర్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనలో ఓనర్ ప్రమేయం ఉంటే అతడిని సైతం అరెస్ట్ చేస్తామని సీఐ నరసింహారాజు తెలిపారు.