శ్రీనగర్ లో ఉగ్రదాడి..15 మందికి గాయాలు

శ్రీనగర్ లో ఉగ్రదాడి..15 మందికి గాయాలు

జమ్ము కశ్మీర్: శ్రీనగర్ లోని జహగిర్ చౌక్ సమీపంలో మౌలానా ఆజాద్ రోడ్‌ మార్కెట్లో గ్రెనేడ్ దాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో 15 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత నెల (అక్టోబర్) 28 న కూడా ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ బస్ స్టాండ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన  గ్రెనేడ్ లాబ్ దాడిలో 20 మంది గాయపడ్డారు. సరిగ్గా వారం రోజులకే రాష్ట్రంలో ఈ దాడి జరగడం చర్చనీయాంశమైంది.