రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితాలో రాష్ట్రానికి చెందిన 10 మందికి చోటు దక్కింది. గ్రోహ్- హురున్ రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్-2023లో ‘గార్కార్పొరేషన్’ కంపెనీ ఓనర్ జి.అమరేందర్ రెడ్డి రూ.15 వేల కోట్ల సంపదతో దేశంలోనే 10వ స్థానంలో నిలిచారు. ఈయన ఫ్యామిలీలోని అభినవ్రామ్రెడ్డి కూడా లిస్టులో ఉన్నారు. మైహోమ్ కన్స్ట్రక్షన్స్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు రూ.9,490 కోట్లతో 13వ ప్లేస్లో, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఓనర్స్ వెంకటేశ్వర్రెడ్డి (రూ.5,940 కోట్లు), ఎస్.సుబ్రమణ్యం రెడ్డి (రూ.5,880 కోట్లు) వరుసగా 16, 17 స్థానాల్లో నిలిచారు. రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్అధినేత అయోధ్య రామిరెడ్డి తొలిసారి ఇందులో చోటు దక్కించుకున్నారు. అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్ సురేంద్ర బొమ్మిరెడ్డి, సురేశ్ బొమ్మిరెడ్డి, సునీల్ బొమ్మిరెడ్డిలు ఒక్కొక్కరు రూ.1,300 కోట్ల సంపదతో ఈ లిస్ట్లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు. తాజ్ జీవీకే హోటల్స్ ఓనర్ జీవీకే రెడ్డి కూడా చోటు దక్కించుకున్నారు.
గ్రోహ్-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్ 2023
గ్రోహ్–హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్ 2023 ను బుధవారం రిలీజ్ చేశారు. డీఎల్ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ రూ. 50,030 కోట్ల సంపదతో ఈ ఏడాది కూడా మొదటి ప్లేస్లో నిలిచారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 4 శాతం తగ్గింది. మాక్రోటెక్ డెవలపర్స్ను నడిపే మంగళ్ ప్రభాత్ లోధా అండ్ ఫ్యామిలీ రూ. 42,270 కోట్ల సంపదతో రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్ 2023 లో రెండో ప్లేస్ పొందారు. బెంగళూరు గ్రూప్ ఆర్ఎంజెడ్ ఓనర్స్ అర్జున్ మెండా అండ్ ఫ్యామిలీ రూ. 37 వేల కోట్ల సంపదతో మూడో ప్లేస్సంపాదించుకుంది. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి గార్ కార్పొరేషన్ను నడుపుతున్న జీ అమరేంద్ర రెడ్డి రూ. 15 వేల కోట్ల సంపదతో టాప్ టెన్లో 10 వ ప్లేస్లో నిలిచారు. ఈ ఏడాదే అమరేంద్ర రెడ్డి టాప్10 లో మొదటిసారిగా స్థానం సంపాదించుకున్నట్లు గ్రోహ్–హురున్ రిపోర్టు వెల్లడించింది.
61 శాతం మంది సంపదలో పెరుగుదల
దేశంలోని 16 సిటీలలో 67 రియల్ఎస్టేట్ కంపెనీలను నడుపుతున్న 100 మంది వ్యక్తుల ర్యాంకులతో గ్రోహ్–హురున్ తన రిపోర్టును బుధవారం రిలీజ్ చేసింది. తాజా లిస్ట్లోని 61 శాతం మంది వ్యక్తుల సంపద పెరిగింది. ఇందులో 25 మంది లిస్ట్లోకి కొత్తగా వచ్చినవారు ఉన్నారు. మరో 36 మంది వ్యక్తుల సంపద తగ్గిపోయింది.37 మంది రియల్ ఎస్టేట్ సంపన్నులతో మహారాష్ట్ర మొదటి ప్లేస్లో నిలవగా, 23 మంది సంపన్నులతో ఢిల్లీ రెండో ప్లేస్లోనూ, 18 మంది సంపన్నులతో బెంగళూరు మూడో ప్లేస్లోనూ నిలిచాయి. సిటీల వారీగా చూసినప్పుడు హైదరాబాద్ నుంచి 10 మంది వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంపన్నులుగా ఈ లిస్ట్లో ప్లేస్ సంపాదించుకున్నారు. గ్రోహ్–హురున్ రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్ 2023లో 25 శాతం మంది కొత్తవారే ఉన్నారని హురున్ ఇండియా ఎండీ అనాస్ రహ్మాన్ జునైద్ చెప్పారు.
రియల్ ఎస్టేట్ ఎంట్రప్రెనూర్లు ఎంతగా సంపద సృష్టిస్తున్నారో దీనిని బట్టి అర్ధమవుతుందని పేర్కొన్నారు. టాప్ 100 రియల్ ఎస్టేట్ ఎంట్రప్రెనూర్ల మొత్తం సంపద రూ. 4,72,330 కోట్లు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 4 శాతం ఎక్కువైంది. ఫీనిక్స్ మిల్స్ ఓనర్స్ అతుల్ రూయా ఫ్యామిలీ రూ. 12,160 కోట్ల సంపదతో 11 వ ప్లేస్లోనూ, రున్వాల్ డెవలపర్స్ నడుపుతున్న సుభాష్ రున్వాల్ ఫ్యామిలీ రూ. 10,260 కోట్ల సంపదతో 12 వ ప్లేస్లోనూ, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ నడిపే జూపల్లి రామేశ్వర్ రావు ఫ్యామిలీ రూ. 9,490 కోట్ల సంపదతో 13వ ప్లేస్లోనూ నిలిచారు. తాజ్ జీవీకే హోటల్స్ఓనర్స్ జీవీకే రెడ్డి ఫ్యామిలీ కూడా టాప్ 100 లిస్ట్లో ప్లేస్ సంపాదించుకుంది. రామ్కీ ఎస్టేట్స్ అండ్ఫార్మ్స్పేరుతో కంపెనీ నిర్వహిస్తున్న ఎంపీ అయోధ్య రామి రెడ్డి తొలిసారిగా గ్రోహ్–హురున్ రియల్ ఎస్టేట్ రిచ్లిస్ట్లో ప్లేస్పొందారు. ఈయన సంపద రూ. 1,420 కోట్లు. అలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నడుపుతున్న సురేంద్ర బొమ్మిరెడ్డి రూ. 1,300 కోట్లు, సురేష్ బొమ్మిరెడ్డి రూ. 1,300 కోట్ల సంపదతో ఈ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీని నడిపే సీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్ సుబ్రమణ్యం రెడ్డిలు తాజా లిస్ట్లో 16, 17 ప్లేస్లు పొందారు.