లేటయిందని ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాయనీయలే.. కరీంనగర్​లో జేఎల్ అభ్యర్థుల ఆందోళన

లేటయిందని ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ రాయనీయలే.. కరీంనగర్​లో జేఎల్ అభ్యర్థుల ఆందోళన

తిమ్మాపూర్, వెలుగు: ఆలస్యంగా వచ్చారని 100 మంది అభ్యర్థులను జేఎల్​పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ ఘటన కరీంనగర్​జిల్లా వాగేశ్వరి అయాన్​డిజిటల్​ఎగ్జామ్​సెంటర్ వద్ద మంగళవారం జరిగింది.​

పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. 9.30లోపు సెంటర్​ఆవరణలోకి  చేరుకున్నా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కన్ఫూజ్​అయ్యామని తెలిపారు. దీంతో ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌కు లేటయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని అభ్యర్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంతో కష్టపడి చదివామని, నిర్ణీత టైంలో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చినా అనుమతించకపోవడంపై పలువురు అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు.