
తిమ్మాపూర్, వెలుగు: ఆలస్యంగా వచ్చారని 100 మంది అభ్యర్థులను జేఎల్పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ ఘటన కరీంనగర్జిల్లా వాగేశ్వరి అయాన్డిజిటల్ఎగ్జామ్సెంటర్ వద్ద మంగళవారం జరిగింది.
పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. 9.30లోపు సెంటర్ఆవరణలోకి చేరుకున్నా ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కన్ఫూజ్అయ్యామని తెలిపారు. దీంతో ఎగ్జామ్కు లేటయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని అభ్యర్థులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎంతో కష్టపడి చదివామని, నిర్ణీత టైంలో సెంటర్కు వచ్చినా అనుమతించకపోవడంపై పలువురు అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు.