వైరా ఎక్సైజ్ అధికారులు101 కేజీల గంజాయి పట్టివేత

వైరా ఎక్సైజ్ అధికారులు101 కేజీల గంజాయి పట్టివేత

వైరా, వెలుగు: ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కలిమెల నుంచి హైదరాబాద్ కు ఎండిన గంజాయి, హాష్  ఆయిల్  తరలిస్తుండగా, ఖమ్మం ఎన్​ఫోర్స్​మెంట్, వైరా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అసిస్టెంట్  కమిషనర్  జి గణేశ్ వివరాలు వెల్లడించారు. పక్కా సమాచారంతో వైరా ఐఎంఎల్  డిపో ముందు తనిఖీలు చేపట్టగా, కారులో తరలిస్తున్న101.5 కేజీల ఎండిన గంజాయి, 2.7 కేజీల హాష్​ ఆయిల్ ను పట్టుబడిందని చెప్పారు.

వీటి విలువ 67.20 లక్షలు ఉంటుందని అన్నారు. గంజాయి, హాష్​ ఆయిల్​ను వైరా ఎక్సైజ్​ సీఐ మమతకు అప్పగించి, కేసు నమోదు చేశామని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రం మీరట్ కు చెందిన మహమ్మద్  అస్లామ్  ఎండు గంజాయిని హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు సమాచారం ఉందని, విచారణ అనంతరం నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. తనిఖీల్లో హెడ్  కానిస్టేబుల్  ఎంఏ కరీం, బాలు, కానిస్టేబుల్  సుధీర్, వెంకట్, హరీశ్, వీరబాబు, హనుమంతరావు, విజయ్, ఉపేందర్  పాల్గొన్నారు.