
అమరావతి: ఏపీలో కొత్తగా 10,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. గడిచిన 24 గంటల్లో కరోనాతో 88 మంది మృతి చెందారని తెలిపింది వైద్యారోగ్యశాఖ. తాజాగా నమోదైన మరణాలతో కలిపి కరోనాతో 3,884 మంది మృతి చెందారని.. ఇప్పటివరకు రాష్ట్రంలో 4 లక్షల 24 వేల 767కి కరోనా కేసులు చేరాయంది. ప్రస్తుతం ఏపీలో 99,129 యాక్టివ్ కేసులున్నాయని.. ఈ రోజు వరకు కరోనా నుంచి కోలుకుని 3,21,754 మంది రికవరీ అయ్యారని వెల్లడించింది. ఏపీలో ఇప్పటివరకు 36 లక్షల 66 వేల 422 కరోనా టెస్టులు నిర్వహించారని చెప్పింది వైద్యారోగ్యశాఖ.