టెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్

టెన్త్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సం బంధించిన ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్​ గురు వారం రిలీజ్ అయ్యింది. ఈ నెల17 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు వెల్లడించారు. రూ.50 ఫైన్​తో డిసెంబర్ 1 వరకూ, రూ.200 ఫైన్​తో డిసెంబర్ 11 వరకూ, రూ.500 ఫైన్​తో డిసెంబర్ 20 వరకూ ఫీజు చెల్లించే అవకాశం ఉందని  తెలిపారు. రెగ్యులర్ స్టూడెంట్లకు  ఫీజు రూ.125గా  ఉంటుం దని, మూడు సబ్జెక్టులు..అంతకంటే తక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన అభ్యర్థులకు రూ.110 ఫీజు ఉంటుందని వివరించారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారికి రూ.125 ఫీజు ఉంటుందని తెలిపారు.