
మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్పరిధిలో కోడి పందేలు వేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. 22 కత్తులు, 3కోళ్లు, రూ.39,600 క్యాష్ను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలోని ఓ ఖాళీ ప్రదేశంలో మంగళవారం కోడి పందేలు వేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, కోడి పందేలు వేస్తున్న 11మందిని అరెస్ట్చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.