
భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విలయతాండవం చేస్తుంది .రోజుకు వందకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు భారత్ లో 1161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 28 మంది చనిపోయారు. 102మంది రికవరీ అయ్యారు.
ఇవాళ మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మహారాష్ట్రలో అత్యధికంగా 215 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళ 202, కర్ణాటక 83, ఢిల్లీ 72,ఉత్తర ప్రదేశ్ 72, తెలంగాణ 70, గుజరాత్ 63, రాజస్థాన్ 60, తమిళనాడు 50 పాజిటివ్ కేసులతో ఉన్నాయి. ఇక మహారాష్ట్రలో కరోనాతో 7 మంది చనిపోయారు. గుజరాత్ లో 5, కర్ణాటకలో 3, ఢిల్లీలో ఇద్దరు చనిపోయారు.