శ్రీరామనవమి సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన శోభయాత్రలో దొంగలు హల్ చల్ చేశారు. 12 మంది బాధితులు తమ ఫోన్లు, బంగారం పోయిందంటూ మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎక్కువగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ర్యాలీలోనే పోయినట్లుగా ఫిర్యాదులు అందాయి. శోభయాత్రలో దొంగల ముఠా డాన్స్ చేయకుండా వ్యక్తుల సెల్ ఫోన్స్, బంగారంపై దృష్టి పెట్టి కాజేశారు.
ఒక గ్యాంగ్ గా ఏర్పడి డాన్సుల మధ్యలో ఒంటిపై బంగారం ఉన్న వారిని టార్గెట్ చేసి కొట్టేసారు దొంగలు. అంతేకాకుండా సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసుల మెడలో చైన్లు కూడా కొట్టేసే ప్రయత్నం చేసింది ముఠా. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో 2తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తు్న్నారు. దొంగలను మంగుర్ బస్తీ యువకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు.