అదుపు తప్పి మినీ బస్సు బోల్తా .. ధర్మసాగర్​ గేట్​ వద్ద ప్రమాదం

అదుపు తప్పి మినీ బస్సు బోల్తా  .. ధర్మసాగర్​ గేట్​ వద్ద ప్రమాదం
  • 12 మంది గాయాలు
  • మూడు ముక్కలుగా విరిగిన స్తంభం

కౌడిపల్లి, వెలుగు: హైదరాబాద్​–- మెదక్ నేషనల్​హైవేపై కౌడిపల్లి మండలం ధర్మసాగర్​ గేట్​ వద్ద ఆదివారం మినీ బస్సు బోల్తా పడడంతో 12 మంది గాయపడ్డారు. హైదరాబాద్​లోని నల్లకుంటకు చెందిన కొంతమంది ఆదివారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవానీ మాత దర్శనానికి వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ధర్మసాగర్ ​గేట్ ​వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ ​స్తంభాన్ని ఢీకొట్టిబోల్తా పడింది.

ఈ ఘటనలో స్తంభం మూడు ముక్కలుగా విరిగిపోయింది. కరెంట్​ వైర్లు తెగి కింద పడిపోయాయి. బస్సులోని ఉమారాణి, కృష్ణ ప్రసాద్, వాణికి తీవ్ర గాయాలు కాగా, మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. దెబ్బలు తగిలిన వారిని 108 అంబులెన్స్ లో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.