ఏపీలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు, 10 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,221 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,59,932కి చేరింది. ఇందులో 15,382 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,37,630 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గురువారం వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,920కు చేరుకుంది.

జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు.. అనంతపురం 41, చిత్తూరు 175, తూర్పుగోదావరి 202, గుంటూరు 144, కడప 65, కృష్ణా 198, కర్నూలు 19, నెల్లూరు 47, ప్రకాశం 50, శ్రీకాకుళం 34, విశాఖపట్నం 69, విజయనగరం 32, పశ్చిమ గోదావరి 145 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.