
- కేర్ దవాఖాన డా.జయచంద్ర వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: మన దేశంలో 26 కోట్ల మంది పొగాకు వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని బంజారాహిల్స్ కేర్దవాఖాన సీనియర్ ఇంటర్వెన్షనల్పల్మనాలజిస్ట్ డాక్టర్ ఏ.జయచంద్ర తెలిపారు. దీనివల్ల ఏడాదికి సుమారు 13 లక్షల మంది మరణిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆయన మాట్లాడారు.
పొగాకు వల్ల దేశం ఆరోగ్య, ఆర్థిక పరంగా భారీ నష్టాన్ని ఎదుర్కొంటోందని జయచంద్ర తెలిపారు. పొగాకు వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయన్నారు.