కాంగ్రెస్​ ఎంపీ సీట్లకు 141 అప్లికేషన్లు

కాంగ్రెస్​ ఎంపీ సీట్లకు 141 అప్లికేషన్లు
  • మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానానికి బండ్ల గణేశ్ దరఖాస్తు
  • ఖమ్మం, సికింద్రాబాద్​ స్థానాలకు మాజీ డీహెచ్​ గడల శ్రీనివాస్​ అప్లై

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నుంచి లోక్​సభ టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే వంద మంది ఆశావహులు లోక్​సభ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటిదాకా అప్లై చేసుకున్న వారి సంఖ్య 141కి చేరింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అధికంగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్​కు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి.

మల్కాజిగిరి పార్లమెంట్​ స్థానానికి బండ్ల గణేశ్, నాగర్​ కర్నూల్​ లోక్​సభ స్థానానికి సంపత్​ కుమార్, ఖమ్మం, సికింద్రాబాద్​ స్థానాలకు మాజీ హెల్త్​ డైరెక్టర్​గడల శ్రీనివాస రావు, కరీంనగర్​ పార్లమెంట్​ స్థానానికి వెలిచాల రాజేందర్​ రావు, ఖమ్మం స్థానానికి వీవీసీ గ్రూప్స్​ అధినేత రాజేంద్రపస్రాద్​అప్లికేషన్​ ఇచ్చారు. ఇన్నాళ్లూ బీఆర్​ఎస్​ సానుభూతిపరుడిగా ఉన్న గడల శ్రీనివాస రావు.. త్వరలో కాంగ్రెస్​ పార్టీలో చేరుతారని తెలుస్తున్నది.