ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు

ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు

లిక్కర్​ స్కాంలో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్​ లో మార్చి 15న  అరెస్ట్​ చేసిన ఈడీ  ఢిల్లీకి తరలించారు.  వైద్య పరిక్షల అనంతరం రేపు ( మార్చి 16) ఉదయం 11 గంటలకు రౌస్​ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.  ఈరోజు రాత్రికి  కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే ఉంచనున్నారు.ఢిల్లీ ఎయిర్​ పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు.    ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద 144వ సెక్షన్ ను విధించారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరినీ ఈడీ కార్యాలయం వైపునకు రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.