కవిత అరెస్ట్ .. కేటీఆర్పై ఈడీ అధికారుల ఫిర్యాదు

కవిత అరెస్ట్ .. కేటీఆర్పై ఈడీ అధికారుల ఫిర్యాదు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. ఈడీ మహిళా అధికారి భాను ప్రియామీనా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సమయంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కావాలనే కవితను శుక్రవారం ఈడీ అదుపులోకి తీసుకుందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 

కవిత అరెస్ట్ పై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్.. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు అని కేటీఆర్ ఆరోపించారు.