దేశంలో కొత్త‌గా 1.5 ల‌క్ష‌ల క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 1.5 ల‌క్ష‌ల క‌రోనా కేసులు

దేశంలో వరుసగా నాలుగో రోజూ 2 లక్షల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం కేసులు మరింత తగ్గాయి. 24 గంటల్లో లక్షా 52వేల 734 కేసులు నమోదయ్యాయి. 3వేల 128 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 20 లక్షల 26వేలకు తగ్గాయి. ఆదివారం నాడు 88వేల 416  మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న సాయంత్రం వరకు దేశంలో 21 కోట్ల 31 లక్షల 54 వేల 129  డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. ఓవరాల్ గా చూస్తే దేశంలో రోజువారీ కేసులు 50 రోజుల కనిష్టానికి తగ్గాయి. రికవరీ రేట్ 91.60శాతానికి పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 9.04శాతానికి తగ్గగా... డెయిలీ పాజిటివిటీ రేట్ 9.07శాతంగా ఉంది.