
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. మంగళవారం రాత్రి దాదాపుర్ లో 36 వాహనాలకు మావోయిస్టులు నిప్పుపెట్టిన గంటల్లోనే తాజాగా బుధవారం మధ్యాహ్నం జవాన్ల వాహనాన్నిఐఈడీతో పేల్చేశారు. జాంబీర్ కేడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడులో వాహనం ముక్కలు ముక్కలు అయ్యింది. ఈ ఘటనలో 15 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. పేలుడు అనంతరం నక్సల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.