రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్ : రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపం చూపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 టెస్టులు నిర్వహించగా 1520 మందికి కరోనా నిర్థారణ అయింది.  209 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు చనిపోయారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,034కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో కేసుల పెరుగుదల 0.58శాతంగా ఉండగా.. 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదుకాలేదు. ఎట్ రిస్క్ దేశాల నుంచి రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వచ్చిన 207 మందికి టెస్టులు నిర్వహించగా 18 మందికి పాజిటివ్గా తేలింది. అధికారులు వారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

మరిన్ని వార్తల కోసం..

దేశంలో విజృంభిస్తున్న కరోనా

యూపీలో కాంగ్రెస్ సభలు, సమావేశాలు రద్దు