
ప్రపంచం మొత్తం షాక్ అయ్యే న్యూస్. ఇది సైబర్ ఎటాక్ ద్వారా జరిగిందా లేక AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేశారా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా.. ఆన్ లైన్ లో 16 వందల కోట్ల పాస్ వర్డ్స్ లీక్ కావటం సంచలనంగా మారింది. అంటే దాదాపు ప్రపంచంలో ఉన్న అందరి అకౌంట్స్ కు సంబంధించిన పాస్ వర్డ్స్ లీక్ అయ్యాయి. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ప్రపంచలో ఇంత పెద్దమొత్తంలో డేటా లీక్ కావడం ఇదే తొలిసారి కావచ్చు. ఒకటి కాదు రెండు కాదు.. 16 వందల కోట్ల పాస్ వర్డ్స్ లీక్.. ఇదే కాదు రికార్డ్ స్థాయిలో డేటా లీక్ కావటంతో.. ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్ వంటి బడా టెక్ కంపెనీలు ఎఫెక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సైబర్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 16 బిలియన్ల పాస్ వర్డ్స్ లీకైనట్లు తేలింది. ఇందులో వివిధ దేశాల ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డేటా కూడా ఉండటం టెక్ దిగ్గజాలను సైతం భయాందోళనకు గురిచేస్తోంది. వివిధ సైబర్ క్రిమినల్స్ తో పాటు పెద్ద పెద్ద సైబర్ చోరీ సంస్థలు ఇందులో పాల్గొన్నట్లు పరిశోధకులు అనుమానిస్తున్నారు. ఎలాంటిక్ సర్చ్ లేదా ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇన్ స్టెన్స్ ద్వారా తాత్కాలికంగా యాక్సెస్ చేసేందుకు చాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. వీటిని డేటా సెట్స్ రూపంలో సేవ్ చేసి అటాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే లీకైన డేటాసెట్స్ లో పాత లాగిన్స్ కాకుండా రీసెంట్ గా క్రియేట్ చేసిన, చేంజ్ చేసిన లాగిన్, పాస్ వర్డ్స్ కు సంబంధించిన డేటా ఉన్నట్లు రీసర్చ్ లో తేలింది. ఒకే సారి మాస్ అటాక్ చేసేందుకు సైబర్ క్రిమినల్స్ కు దొరికిన బ్లూ ప్రింట్ గా అభివర్ణిస్తున్నారు. దీంతో పర్సనల్ క్రెడెన్షియల్స్ దొరకడంతో ఏ క్షణమైనా ఈజీగా అకౌంట్ టేకోవర్ చేసుకోవడం, ఐడెంటిటీ చోరీ చేయడం, టార్గెట్ చేసి అకౌంట్స్ స్వాహా చేయడం ఇలా ఏదైనా చేసేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు.
చోరీకి గురైన డేటా సెట్స్ ఆన్ లైన్ సర్వీస్ అందించే యాపిల్, గూగుల్, ఫేస్ బుక్, గూగుల్, గిట్ హబ్, టెలిగ్రామ్ తో పాటు ప్రభుత్వ సేవలకు సంబంధించిన పోర్టళ్లు కూడా ఉన్నట్లు రీసెర్చర్స్ తెలిపారు. ఇంత భారీ ఎత్తున డేటా లీక్ అవ్వడం, పాస్ వర్డ్స్ చోరీ చరగడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని.. యూజర్లు వీలైనంత తొందరగా పాస్ వర్డ్స్ అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. సైబర్ అటాక్ ను డైరెక్ట్ గా ఆపలేమని.. క్రెడెన్షియల్స్ మార్చుకోవటమే ప్రస్తుతం ఉన్న మార్గమమని తెలిపారు.