మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులందరూ కూలీలే. మృతుల్లో 8 మంది పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులను ఈ జిల్లాలోని అభోడా, కేరళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్కు అరటి లోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని రూరల్ ఆస్పత్రికి తరలించారు.
