వరంగల్ జిల్లాలో ముగిసిన జాతీయస్థాయి నాటకపోటీలు

  వరంగల్ జిల్లాలో ముగిసిన జాతీయస్థాయి నాటకపోటీలు

కాశీబుగ్గ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ, చలనచిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ సౌజన్యంతో సోమవారం వరంగల్ జిల్లా రంగస్థలం కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులుగా నగరంలోని పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న 16వ జాతీయస్థాయి నాటక పోటీలు సోమవారం ముగిశాయి. కార్యక్రమానికి చీఫ్​గెస్ట్​గా హాజరైన మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలు కళాకారులను ప్రోత్సహించి ఆదుకోవాలని కోరారు. అనంతరం కళాకారులకు మెమోంటోలు అందజేశారు.