గాజా ఆస్పత్రిలో 170 మంది టెర్రరిస్టులు హతం

గాజా ఆస్పత్రిలో 170 మంది టెర్రరిస్టులు హతం
  • ఇజ్రాయెల్  మిలిటరీ వెల్లడి

జెరూసలెం: గాజాలోని అల్  షిఫా ఆసుపత్రిలో గడిచిన వారం రోజుల్లో 170 మంది గన్ మెన్ ను హతమార్చామని ఇజ్రాయెల్  మిలిటరీ వెల్లడించింది. ఈనెల 18న తెల్లవారుజామున ఆ ఆసుప్రతిలో తమ బలగాలు ప్రవేశించాయని, కూంబింగ్  నిర్వహిస్తున్నాయని మిలిటరీ తెలిపింది. ఆ కాంప్లెక్స్​ను సొరంగ మార్గానికి అనుసంధానించారని, ఆ సొరంగాన్ని హమాస్  టెర్రరిస్టులు, పాలస్తీనియన్  ఫైటర్ల కోసం వాడుతున్నారని పేర్కొంది.

‘‘గత వారం రోజుల్లో అల్  షిఫా హాస్పిటల్  ప్రాంతంలో 170 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాం. 800 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, టెర్రర్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గుర్తించాం” అని ఇజ్రాయెల్  మిలిటరీ వివరించింది.