
హైదరాబాద్సిటీ, వెలుగు: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిటీ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చార్మినార్, మలక్ పేట, యాకత్ పుర, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల లబ్ధిదారులకు మినిస్టర్ క్వార్టర్స్లో డబుల్ బెడ్ రూం పట్టాలను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ డబుల్బెడ్రూమ్ఇండ్లను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్లో నిర్మించినట్లు తెలిపారు.
సుమారు1,730 మంది లబ్ధిదారులకు అక్కడ ఇండ్లను కేటాయించారు. అంబర్పేటకు చెందిన 134, బహుదూర్ పురకు చెందిన - 294, బండ్లగూడ కు చెందిన - 155, చార్మినార్ కు చెందిన -209, సైదాబాద్ కు చెందిన - 206, ఇతర ప్రాంతాల్లో ఉన్న 28 మందికి శుక్రవారం వీటిని అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు