ఉద్యమకారుల స్మృతి వనానికి భూమి ఇవ్వండి : 1969 ఉద్యమకారుల సమితి

ఉద్యమకారుల స్మృతి వనానికి భూమి ఇవ్వండి : 1969 ఉద్యమకారుల సమితి
  • కేంద్రమంత్రి రాజ్​నాథ్​కు 1969 ఉద్యమకారుల సమితి వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల స్మృతి వనం కోసం కంటోన్మెంట్​లో వంద ఎకరాలు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ను 1969 ఉద్యమకారుల సమితి నేతలు కోరారు. బుధవారం బేగంపేట ఎయిర్ పోర్ట్​లో ఉద్యమకారుల సమితి జనరల్ సెక్రటరీ దుశ్చర్ల సుదర్శన్ రావు.. రాజ్​నాథ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. 

ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఇచ్చిన లేఖలను రాజ్​నాథ్​సింగ్​కు సుదర్శన్ రావు అందజేశారు. ఈ అంశం మా పరిశీలనలో ఉందని, సెప్టెంబర్ నెలాఖరులో ఢిల్లీ వచ్చి కలవాలని రాజ్ నాథ్ సింగ్ తెలిపినట్టు సుదర్శన్ రావు వెల్లడించారు.