కొవిడ్–19 దెబ్బకు ఆసియా పసిఫిక్ రీజియన్లో అన్ని ఎయిర్ లైన్లకు కలిపి 27.8 బిలియన్ డాలర్ల (రూ. 2 లక్షల కోట్లు) మేర నష్టం వస్తుందని అంచనా వేసినట్టు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది మొత్తంగా ఆసియా పసిఫిక్లో ప్యాసింజర్ల సంఖ్య 13 శాతం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్కు బలైనవారి సంఖ్య 2,236కు పెరిగింది. మొత్తం 75,465 మందికి వైరస్ సోకింది. వుహాన్ లోని ఫస్ట్ పీపుల్స్ హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ పెంగ్ యిన్హువా (29) కూడా చనిపోయారు.
ఇండియన్లు కోలుకుంటున్నరు..
జపాన్ నౌక డైమండ్ ప్రిన్సెస్లో కొవిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8 మంది ఇండియన్లు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఈ షిప్ లో 138 మంది ఇండియన్లు ఉండగా, మిగతా వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు.