ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్

న్యూఢిల్లీ: ఇద్దరు లష్కరే తొయిబా టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌‌, అనంత్‌‌నాగ్ జిల్లాలోని సిర్హమా ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. సెర్చ్ చేస్తున్న సమయంలో మిలిటెంట్లు సెక్యూరిటీ ఫోర్సెస్‌‌పై ఫైరింగ్ చేశాయని పోలీసులు తెలిపారు. దీంతో ఎదురు కాల్పులు చేశామని, చనిపోయిన టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.