హైదరాబాద్, వెలుగు: తమ బస్సుల్లో ఆర్టీసీ బస్సుల కంటే 20 శాతం తక్కువ చార్జీలు ఉంటాయని స్మార్ట్బస్ ఆపరేటర్ ఫ్రెష్బస్ ప్రకటించింది. హైదరాబాద్–విజయవాడ, బెంగళూరు–తిరుపతి మార్గాల్లో ప్రస్తుతం 12 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని తెలిపింది. డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ ఖర్చు తక్కువ కాబట్టి చార్జీలూ తక్కువని పేర్కొంది.
రెండు రౌండ్ల ప్రీ-సీడ్ ఫండింగ్లో రూ.23.5 కోట్ల పెట్టుబడిని సాధించామని తెలిపింది. 2025 మార్చి నాటికి రూ.100 కోట్లను సేకరిస్తామని తెలిపింది. అప్పటికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, జైపూర్, పంజాబ్, హర్యానా మొదలైన 30 నగరాల్లో 170 బస్సులను నడపనుంది.