దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గిందని, ఇప్పటివరకు 200.61 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.33 శాతమని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొంది.