ఎల్బీనగర్, వెలుగు: ఏపీనుంచి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సులో హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ వినోద్ తెలిపిన ప్రకారం.. ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కొర్ర ప్రవీణ్ కుమార్, ఒడిశాకు చెందిన బింగు కార, రాజేశ్కారలు కలిసి ఏపీకి చెందిన పాడి కృష్ణారావు నుంచి హాష్ ఆయిల్ సేకరించారు.
అనంతరం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు తరలించారు. ఎల్బీనగర్ మెట్రో సమీపంలో ఓ వ్యక్తికి ఇచ్చేందుకు ఎదురు చూస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 2 కిలోల 100 గ్రాముల హాష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకున్నారు.

