చాక్లెట్ పౌడర్ లో బంగారం తరలింపు.. వ్యక్తి అరెస్ట్

చాక్లెట్ పౌడర్ లో బంగారం తరలింపు.. వ్యక్తి అరెస్ట్

తిరుచిరాపల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చాక్లెట్ పౌడర్ రూపంలో ఉన్న 211 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.21.55 లక్షల విలువ కలదిగా అధికారులు తెలిపారు. ఎయిరిండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అయితే అతని నుంచి చాక్లెట్ పౌడర్ లో బంగారం పౌడర్ ను కలిపి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాలను అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. 

ఈ ఘటనలో 211 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజీ నుంచి 175 గ్రాముల బంగారు గొలుసులు కూడా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ రికవరీ చేసిన మొత్తం బంగారం విలువ దాదాపు రూ.21.55లక్షలు ఉంటుందని చెప్పారు.