భారీ చేపను చూద్దాం రండి

భారీ చేపను చూద్దాం రండి

రాష్ట్రంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో కాలువలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. అయితే రాజన్న సిరిసిల్లలోని రామన్నపేటలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు చెరువు ఉప్పొంగడంతో అక్కడి మత్స్యకారులు చేపల వేట సాగించారు. ఈ నేపథ్యంలో ఓ మత్స్యకారుని వలలో ఏకంగా 23 కిలోల చేప చిక్కింది. దీంతో ఆ వ్యక్తి ఆనందం వ్యక్తం చేశాడు.