
11 మందికి నెగెటివ్
అమరావతి, వెలుగు: ఏపీలో 24 కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కరోనా సస్పెక్టివ్స్బ్లడ్ శాంపుల్స్ను గాంధీ, పుణే ల్యాబ్కు పంపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. 24 మందిలో 11 మందికి కరోనా లేనట్లు తేలిందని, మిగిలిన 13 మంది రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపింది. కరోనాపై హై అలర్ట్ ప్రకటించిన ఏపీ రోజూ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తోంది. కరోనా అనుమానిత కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని బులెటిన్లో పేర్కొంది. స్థానికంగా ఉన్నవారికి కరోనా వైరస్ సోకలేదని, వదంతులు నమ్మవద్దని తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితోపాటు రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా స్పెషల్వార్డులు, ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.