ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్య‌ధికం

ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో అత్య‌ధికం

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,05,026 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మంగ‌ళ‌వారం వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,744కు చేరుకుంది.

గ‌డిచిన 24 గంట‌ల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 52, చిత్తూరు 321, తూర్పుగోదావరి 424, గుంటూరు 323, కడప 127, కృష్ణా 332, కర్నూలు 35, నెల్లూరు 94, ప్రకాశం 70, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 122, విజయనగరం 85, పశ్చిమ గోదావరి 375 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,207కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 788 మంది కరోనాతో మరణించారు.