బంగ్లాదేశ్ కంటైనర్ డిపోలో అగ్ని ప్రమాదం..35 మంది మృతి

బంగ్లాదేశ్ కంటైనర్ డిపోలో అగ్ని ప్రమాదం..35 మంది మృతి

బంగ్లాదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 35మంది సజీవదహనం కాగా.. మరో 450 మందికి గాయాలయ్యాయి. చిట్టగాంగ్ సీతకుంటలోని ప్రైవేటు కంటైనర్ డిపోలో పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత భారీగా మంటలు చెలరేగినట్లు తెలిపారు అధికారులు. కెమికల్స్ వల్లే భారీగా మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా  ప్రయత్నిస్తుంది. శనివారం రాత్రి 9 గంటలకు మంటలు చెలరేగగా, అర్ధరాత్రి సమయంలో పేలుడు సంభవించిందని పోలీసు అధికారి తెలిపారు. పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పేలుడు కారణంగా సమీపంలోని ఇండ్ల కిటికీలు పగిలిపోయాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

యూపీ సీఎం యోగీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..

ఫుడ్ డెలివరీ బాయ్‌‌ని కొట్టిన కానిస్టేబుల్