హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 2606 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. ఒకవైపు ప్రభుత్వం, వైద్య నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. మరో వైపు టెస్టుల సంఖ్య పెంచుతూ.. టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన 2606 కేసుల్లో అత్యధిక శాతం గ్రేటర్ పరిధిలో 1583 కేసులు, మేడ్చల్ పరిధిలో 292 కేసులు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 214 కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి
కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
కొంప ముంచిన పెంపుడు శునకం బర్త్ డే పార్టీ
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్