24 గంటల్లో 26,626 వేల కేసులు..341మరణాలు

24 గంటల్లో 26,626 వేల కేసులు..341మరణాలు

భారత్ లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువన నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 26,624 కేసులు నమోదవడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,31,223 కి చేరింది. ఇందులో 3,05,344 ఆక్టివ్ కేసులున్నాయి. నిన్న 26,690 మంది కోలుకోవడంతో మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. నిన్న మరో 341 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,45,477కు చేరింది. ఇక నిన్న 11,07,681 శాంపిల్స్ టెస్టు చేయడంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య డిసెంబర్ 19 వరకు 16 కోట్ల 11లక్షల 98వేల 195 కు చేరింది.