భారత్ లో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా 30 వేలకు దిగువన నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 26,624 కేసులు నమోదవడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,31,223 కి చేరింది. ఇందులో 3,05,344 ఆక్టివ్ కేసులున్నాయి. నిన్న 26,690 మంది కోలుకోవడంతో మొత్తం 95,80,402 మంది కోలుకున్నారు. నిన్న మరో 341 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1,45,477కు చేరింది. ఇక నిన్న 11,07,681 శాంపిల్స్ టెస్టు చేయడంతో దేశంలో కరోనా టెస్టుల సంఖ్య డిసెంబర్ 19 వరకు 16 కోట్ల 11లక్షల 98వేల 195 కు చేరింది.
India records 26,624 new COVID-19 cases, 29,690 recoveries, & 341 deaths in the last 24 hours, as per Health Ministry.
Total cases: 1,00,31,223
Total recoveries: 95,80,402
Active cases: 3,05,344
Death toll: 1,45,477 pic.twitter.com/JWFahf7s5Q
— ANI (@ANI) December 20, 2020