తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,795 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,14,483 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 788కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 872 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 86,095గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,600 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది.

నిన్న ఒక్కరోజే 60,386 టెస్టులు చేయగా వాటిలో 2,795 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 11,42,480 టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 449, రంగారెడ్డి 268, నల్గొండ 164, ఖమ్మం 152, కరీంనగర్ 136, వరంగల్ అర్బన్ 132, కరీంనగర్ 127, మేడ్చల్ 113, సిద్ధిపేట్ 113, నిజామాబాద్ 112, మంచిర్యాల 106, మహబూబాబాద్ 102, జగిత్యాల 89, సూర్యపేట్ 86, పెద్దపల్లి 77, కామారెడ్డి 76, భద్రాద్రి 72, కామారెడ్డి 55, వనపర్తి 55, మహబూబ్ నగర్ 45, జనగామ 42 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కార్యకర్తలకు న్యాయం చేయలేనపోతున్నానని లోక్ సభ ఎంపీ రాజీనామా