
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లో కొత్తగా మరో 28 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్లో సూపరింటెండెంట్ ప్రొ. రాజకుమారి సోమవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు వీటిని కలుపుకొని మొత్తం 148 సీసీ కెమెరాలు పనిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హాస్పిటల్ ఆవరణలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి సీఐ అనుదీప్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. కే సునీల్ కుమార్, ఆర్ఎమ్ఓ వన్ డా. శేషాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.