హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్లలో రిజర్వేషన్ ఉండదని అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు సికింద్రాబాద్, మంచిర్యాల మీదుగా 3 సర్వీసులు, మంచిర్యాల–సికింద్రాబాద్ మధ్య మరో 3, సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్కు 2, సిర్పూర్ కాగజ్ నగర్– సికింద్రాబాద్కు 2, నిజామాబాద్–వరంగల్మధ్య 4, వరంగల్–నిజామాబాద్ మధ్య 4, కాజీపేట–ఖమ్మం మధ్య 4, ఖమ్మం – కాజీపేట మధ్య 4, ఆదిలాబాద్–కాజీపేట మధ్య 1, కాజీపేట – ఆదిలాబాద్మధ్య ఒక సర్వీసు నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ రైళ్లన్నీ మౌలాలి, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘనాపూర్, పిండ్యాల్, కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, రామగుండం తదితర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
